కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కవగా ఉన్న 8 నగరాల నుంచి బెంగాల్ కు విమానాలు రాకుండా నిషేదం విధించాలని కేంద్రాన్ని కోరింది. జూలై 6 నుంచి రెండు వారాల పాటు ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్, సూరత్ నగరాల నుంచి బెంగాల్కు వచ్చే విమానాలపై నిషేధం విధించాలని చెప్పింది. అటు, కోల్కతా, బగ్దోగ్రా, అండాల్ పట్టణాలకు వచ్చే విమానాల సంఖ్యను నియంత్రించాలని కోరింది.