అఫ్గానిస్తాన్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కజిన్ కాల్పుల్లో మృతి చెందాడు. ఆష్రాఫ్ ఘనీ బంధువు అతని నివాసంలోనే విగతజీవిగా పడిఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఉగ్రవాద సంస్థ ఆఫ్గాన్ ప్రభుత్వంపై తమ దాడులను తిరిగి ప్రారంభించింది. దేశ అధికారంపై అదేవిధంగా సైనిక దళాలపై దాడులను ప్రకటించింది. జూన్ నెల ప్రారంభంలో ఆష్రాఫ్ ఘనీ ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు.