పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు గుడ్‌న్యూస్

Update: 2020-07-06 18:40 GMT

కరోనా లాక్‌డౌన్ కారణంగా పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు గుడ్ న్యూస్. పాక్‌లో ఉన్న 114 మందిని జులై 9న ఇండియాకు పంపించనున్నారు. అటారీ-వాఘా సరిహద్దు మీదుగా వీరిని ఇండియాకు పంపించనున్నారు. ఈ మేరకు పాక్ సర్కార్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

వివిధ కారణాలతో పాకిస్తాన్ వెళ్లి.. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆ దేశంలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను వెనక్కి పంపించింది దాయాది దేశం. 700 మంది భారతీయ పౌరులను అవసరమైన ఆరోగ్య భద్రతా ప్రొటోకాల్స్‌ను అనుసరించి జూన్ 25,26,27 న అటారీ-వాఘా బోర్డర్ ద్వారా భారతదేశానికి తిరిగి పంపించారు. ఇప్పుడు పాక్‌లో ఉన్న 114 మందిని జులై 9న ఇండియాకు పంపించనున్నట్లు పాక్ సర్కార్ ప్రకటించింది.

Similar News