ఎంసీఎల్‌ఆర్‌ రేటును తగ్గించిన ఎస్‌బీఐ

Update: 2020-07-08 12:43 GMT

మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 6.65 శాతానికి తగ్గిస్తున్నట్టు దేశీయ దిగ్గజ సంస్థ ఎస్‌బీఐ ప్రకటించింది. తగ్గింపు నిర్ణయం ఈనెల 10 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో MCLR రేటును ఎస్‌బీఐ వరుసగా 14వసారి తగ్గించినట్లయింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది.

ఎంసీఎల్‌ఆర్‌ రేటు తగ్గింపుతో వరుసగా మూడో రోజూ ఎస్‌బీఐ లాభాల్లో ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎస్‌బీఐ 3 శాతం పైగా లాభపడి రూ.194.10 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి బుధవారం ఉదయం 9:36 నిమిషాల వరకు దాదాపు 2.09 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.

ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.168,273.55 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 14.54 కాగా, కంపెనీ పీ/ఈ 11.62గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.236.14, ఈపీఎస్‌ రూ.16.23గా ఉంది.

Similar News