కరోనాకు తోడు పలు దేశాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఇటీవల మయన్మార్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి సుమారు 200 మంది చనిపోయారు. అటు, జపాల్ లో కూడా వరదలలో పదుల సంఖ్యలో కొట్టుకుపోయారు. తాజాగా చైనాలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 9 మంది సజీవదహానం అయిపోయారు. ఈ ఘటన హుబై ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.