పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కరోనా సోకలేదని అధికారులు తెలిపారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ నివాస్లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కిరణ్ బేడీకి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయిందని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కిరణ్ బేడీతో పాటు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయింది. గవర్నర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో 48 గంటల పాటు కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.