అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన స్లొవేనియాలో చోటు చేసుకుంది. మెలానియా స్వస్థలమైన స్లొవేనియాలోని జులై 4న రాత్రి.. ఆమె విగ్రహానికి నిప్పు పెట్టినట్లు.. విగ్రహాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ వెల్లడించారు.
స్లోవేనియాలో మెలానియా ట్రంప్ రూపాన్ని పోలిన చెక్క విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే అమెరికన్లు జులై 4 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదే రోజున మెలానియా విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై జులై 5న బ్రాడ్ డౌనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డౌనీ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్రహాన్ని ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేశారు.