జమ్ముకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఆరు వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అఖ్నూర్, జమ్మూ సెక్టార్లలో రూ.45 కోట్ల వ్యయంతో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) వీటిని నిర్మించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆరు వంతెనలను రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు.