ఓ విద్యార్దికి రాయని పరీక్షకు మార్కులు వేసిన ఘటన కాకతీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. బూర రమేష్ అనే విద్యార్థి ఎంబీఎ మొదటి సెమిస్టర్ బిజినెస్ లా పరీక్ష రాశాడు. గత నెల వచ్చిన ఫలితాల్లో బిజినెస్లా కు బదులు.. ఇన్నోవేషన్ క్రియేటివిటీ పేపర్కు మార్కులు వేశారని ఈ విద్యార్థి తెలపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లానని.. తమకు న్యాయం చేయాలని కోరాడు.