సికింద్రాబాద్లో ఆదివారం ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయి. జులై 12న సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం మారేడుపల్లిలోని తన నివాసంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించనున్న పట్టువస్త్రాలను మహంకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.