నేపాల్ వరదల్లో 37 చేరిన మృతుల సంఖ్య

Update: 2020-07-11 22:16 GMT

నేపాల్ ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోతున్న వారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం నాడు 22 మంది వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందగా.. ఈ రోజు మృతుల 37కి చేరింది. తాజాగా నమోదైన మరణాలు అన్నీ మైగ్డి జిల్లాలోనే 15 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొండచరియల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Similar News