తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయ కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నిరసన తెలపాలని నిర్ణయించారు. దీంతో గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాంను అరెస్టు చేశారు. నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.