పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల కోసం ఢిల్లీ వచ్చే ఎంపీలకు క్వారంటైన్ అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలపింది. రాజ్యసభ సెక్రటేరియేట్కు సమాచారం కూడా పంపింది. స్టాండండి కమిటీ సమావేశాలకు హాజరవుతున్న కొందరు ఎంపీలు.. క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.