ఉత్తరాఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుక్కున్న మరో ఇద్దరినీ జాతీయ విపత్తు స్పందనా దళాలు రక్షించాయి. ఈ ఘటన డెహ్రాడూన్లోని చుక్కువాల ప్రాంతంలో చోటు చేసుకుంది.
చుక్కవాల ప్రాంతంలోని ఇంద్రాకాలనీలో బుధవారం తెల్లవారుజూమున రెండు గంటల ప్రాంతంలో భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద మూడు మృతదేహాలను బయటకు తీశామని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్యప్రసాద్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రాష్ట్ర విపత్తు బృందానికి సహాయక చర్యల్లో సాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
సమీర్ చౌహాన్ అనే వ్యక్తిని, కృష్ణా అనే పదేళ్ల బాలుడిని ఎన్డీఎఫ్ సిబ్బంది రక్షించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారని ఓ మహిళ శిథిలాల కింద ఉందన్న అనుమానంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.