దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. ఇక బీహార్లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. బీహార్ గవర్నర్ హౌస్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. అక్కడ పని చేసే 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారందరిని కరోనా సెంటర్ కు తరలించారు. మిగతా సిబ్బందిని హోం క్వారంటైన్ లో ఉంచారు. వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. గవర్నర్ ఫగు చౌహాన్ కూడా తగు జాగ్రత్తల తీసుకుంటున్నారు.
కాగా బీహార్ లో ఇప్పటి వరకు 18,853 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 143 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 5,691 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 13,019 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.