తెలంగాణలో కొత్తగా 1524 పాజిటివ్ కేసులు

Update: 2020-07-15 08:42 GMT

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం 1,524 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 815 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 37,745 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 10మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 375కు చేరింది. రాష్ట్రంలో 1,95,024 పరీక్షలు చేశారు.

Similar News