మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌

Update: 2020-07-15 17:12 GMT

ఇప్పటికే రాజస్థాన్ లో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్.. అలాగే ఆయన మద్దతుదారులైన ఇద్దరు మంత్రులను తొలగించిన కాంగ్రెస్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాను సస్పెండ్‌ చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయన కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణను ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని

సస్పెండ్ చేశారు. కాగా సంజయ్‌ ఝా.. పలుమార్లు పార్టీ నిర్ణయాల్ని తప్పుబడుతూ విమర్శలు చేశారు. దాంతో ఆయనను ఇటీవల పార్టీ అధికార ప్రతినిధి పదవీ నుంచి తప్పించింది. ఈ క్రమంలో మంగళవారం సచిన్‌ పైలట్‌ను సమర్ధిస్తూ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దాంతో

సంజయ్‌ ఝాను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది.

Similar News