టర్కీలో విమాన ప్రమాదం.. ఏడుగురు మృతి

Update: 2020-07-16 13:24 GMT

టర్కీలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలడంతో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగులు ఎత్తులో వస్తున్న విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు తెలియజేశారు. విమానం బయలుదేరిన కొద్ది సమయంలోనే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదని తెలిపారు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని.. త్వరలేనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి అన్నారు.

Similar News