ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవతున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1.34 కోట్లకు పైగా చేరాయి. అటు, కరోనా మరణాల సంఖ్య 5.82 లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే 62,000 మందికి కరోనా సోకింది. అటు భారత్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,695 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కి చేరింది.