పాకిస్థాన్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు అంతకంతకూ మృతులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో పాక్లో కొత్తగా 1,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 46 మంది మృతి చెందారు. ఆ దేశంలో ఇప్పటివరకు 2,63,496 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,568 మంది మృతి చెందారు.