మధ్యప్రదేశ్ లోని భోపాల్లో గురువారం 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాజధానిలో రోగుల సంఖ్య 5 వేలకు చేరుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు 148 మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్లో పెరుగుతున్న కరోనా సంక్రమణ కారణంగా, జూలై 24 రాత్రి 8 గంటల నుండి పది రోజుల పూర్తిస్థాయి లాక్డౌన్ ను విధించాలని నిర్ణయించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో జారీ చేసిన లాక్డౌన్ సడలింపు ఆర్డర్లను రద్దు చేశారు. అన్ని మార్కెట్లు గురువారం మరియు శనివారం మాత్రమే తెరుచుకుంటాయని ప్రకటించింది ప్రభుత్వం. ఇండోర్ నగరం పాజిటివ్ రేటు 7.72 గా ఉందని ప్రభుత్వం పేర్కొంది.