పశ్చిమబెంగాల్ గవర్నర్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏమాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంలేదని అన్నారు. అధికార పార్టీ నేతల విషయంలో ఒకలా.. ఇతరుల విషయంలో ఒకలా పోలీసుల తీరు ఉందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలీసులకు టార్గెట్గా మారారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సమయం తీసుకొని నాతో సంభాషించాలని కోరుతున్నానని గవర్నర్ ధన్కర్ ట్వీట్ చేశారు.