ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతం చేయడం అంత సులభం కాదని యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అన్నారు. మహమ్మారిని కట్టడి చేయడం సాద్యం కాదని.. దీంతో కలిసి జీవించడాని ప్రజలు అలవాటు పడాలని అన్నారు. కరోనా మనల్ని వదిలి ఎక్కడికీ పోదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. మహమ్మారితో కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు. రానున్న చలికాలంలో ఈ మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని.. దానిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని టోనీ బ్లెయిర్ పేర్కొన్నారు.