జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా

Update: 2020-08-06 11:58 GMT

మాజీ కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ ఎల్జీగా సేవలు అందిస్తున్న గిరీష్‌ చంద్ర ముర్ము బుధవారం పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదించారు. దీంతో నూతన ఎల్జీగా మనోజ్ సిన్హా నియామకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి కూడా ఆయన నియామకానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలైంది.

Similar News