బ్రెజిల్లో కరోనా విస్ఫోటనం చెందుతోంది. కొత్తగా 49 వేల 970 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 30 లక్షల 12 వేల 412 కు చేరుకున్నాయి. అలాగే శనివారం 905 మంది మరణించడంతో, బ్రెజిల్ లో మరణాల సంఖ్య లక్ష దాటింది. బ్రెజిల్ కరోనాకు అత్యధికంగా ప్రభావితమైనది సావో పాలో.. ఈ రాష్ట్రంలో 25 వేల మరణాలు మరియు 6 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కాగా కరోనా సంక్రమణ విషయంలో అమెరికా తరువాత బ్రెజిల్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.