అవి అమ్మేసి ఇది తీసుకున్నా: రేణూ దేశాయ్

Update: 2020-08-11 17:26 GMT

వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తే కొంతైనా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం అని పెట్రోల్ తో నడిచే తన రెండు కార్లు అమ్మి ఎలక్ట్రిక్ కొన్నానని చెబుతున్నారు నటి రేణూ దేశాయ్. సినిమాల్లో నటించకపోయినా, బుల్లి తెరమీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే రేణూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ పోస్టులు పెడుతూ అభిమానులకు ఆనందాన్ని పంచుతారు. మారిషస్ లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంధనంతో నడిచే తన ఆడీ ఏ6, ఫోర్బ్స్ బాక్సర్ కార్లను అమ్మేసి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు. కార్లు అమ్మడం కష్టంగా అనిపించినా, ఇంధనంతో భూమిపై నివసించే జీవరాశులు క్యాన్సర్ బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Similar News