ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులు.. మావోయిస్టుల కోసం గాలించారు. ఇది గ్రహించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. కాల్పుల్లో నలుగురు హతమయ్యారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం మావోయిస్టు మృతదేహాలతో పాటు.. 303 రైఫిల్, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రి పోలీసులకు లభించింది. ఇంకా మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.