చెన్నైలో భారీగా డ్రగ్స్ సీజ్..

Update: 2020-08-12 22:00 GMT

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి వీటిని దిగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. అయిదువేలకు పైగా క్యాప్సిల్స్ పెద్దమొత్తంలో పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 65 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు.

Similar News