వెయ్యి మంది ఖైదీలకు కరోనా

Update: 2020-08-14 08:26 GMT

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలోని జైళ్లలో 1000 మంది ఖైదీలకు, 292 మంది జైలు సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. అయితే ఇప్పటివరకు వారిలో 814 మంది ఖైదీలు, 268 మంది జైలు ఉద్యోగులు కోలుకున్నారు. ఈ మహమ్మారి ఆరుగురిని బలితీసుకుందని జైలు అధికారులు తెలిపారు. అయితే, జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ జైళ్లను శానిటైజ్ చేస్తున్నారు. అన్ని మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Similar News