అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలోవర్గపోరు భగ్గుమంది. నియోజకవర్గంలో నాలుగు గ్రూపులుగా విడిపోయింది వైసీపీ.ఎమ్మెల్సీ ఇక్బాల్కు చెక్ పెట్టింది అధిష్టానం.టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకు రావాలని ఇక్బాల్కు సూచించారు ఇన్చార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి, సీఎంఓ ముఖ్య అధికారి. అయితే సీఎంను కలసి పరిస్థితి వివరించేందుకు ఆయనకు సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే త్వరలోనే హిందూపురం నియోజక వర్గానికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు ఇటీవలే కర్ణాటక ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వనాధ రెడ్డి తో కలసి జగన్ను కలిశారు దీపిక.గతంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ను కొందరు అసమ్మతి నేతలు వ్యతిరేకించిన నేపధ్యంలో దీపికను హిందూపురం ఇన్ఛార్జ్ నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం నిర్ణయంపై భగ్గుమంటున్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం నేతలు.