AP Corona Cases : ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 35 మరణాలు
AP Corona Cases : ఏపీలో కొత్తగా 3వేల 797 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో చికిత్స పొందుతూ 35 మంది చనిపోయారు.
AP Corona Cases : ఏపీలో కొత్తగా 3వేల 797 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో చికిత్స పొందుతూ 35 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 89వేల 513కు చేరగా.. మరణాలు 38వేల 338కు చేరాయి. 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు జిల్లాలో కరోనాతో ఏడుగురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, నెల్లూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.