AP Corona cases : ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు

AP Corona cases : ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి.

Update: 2021-06-25 13:00 GMT

AP Corona cases : ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 71వేల 475కి చేరింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 12వేల 528కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 47వేల 790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 8 మంది, గుంటూరులో ఐదుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు మరణించారు. కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

Tags:    

Similar News