AP Corona Cases : ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు..!

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదయ్యాయి.

Update: 2021-06-20 12:15 GMT

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 5 వేల 646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 50మంది మరణించారు.ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 18 లక్షల 50వేల 563 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12వేల 319మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఏపీలో ప్రస్తుతం 63వేల 68 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో చిత్తూరుజిల్లాలో అత్యధికంగా 11మంది మరణించగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 7మంది, గుంటూరులో 6, తూర్పుగోదావరిలో 5గురు కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు.

గడిచిన 24గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరిజిల్లాలో ఒక వెయ్యి 98 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 890 కేసులు, పశ్చిమగోదావరిజిల్లాలో 761 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యంత తక్కువగా 155 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 7వేల 772మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Tags:    

Similar News