Chitoor: రోడ్డుపైకి ఏనుగుల గుంపు.. భయంతో వాహనదారులు..

Chitoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.

Update: 2022-12-14 07:41 GMT

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన పలమనేరు రూరల్‌ మండలం మొసలిమడుగు దర్గా వద్ద జరిగింది. ఒకేసారి 22 ఏనుగులు రోడ్డుపైకి వచ్చాయి.



కుక్కలపై దాడికి యత్నించాయి. ఏనుగుల గుంపుతో పలమనేరు- గుడియాత్తం రహదారిపై గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాకర్‌ సహాయంతో గజరాజుల గుంపును అడవిలోకి మళ్లించారు అటవీశాఖ సిబ్బంది. తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో పలమనేరు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

Tags:    

Similar News