AMARAVATHI: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం

పెట్టుబడులే లక్ష్యంగా యూఏఈలో చంద్రబాబు పర్యటన.. శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌తో చంద్రబాబు భేటీ.. దుబాయ్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సీఎం

Update: 2025-10-23 02:30 GMT

పె­ట్టు­బ­డు­లే లక్ష్యం­గా ఏపీ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు యూ­ఏ­ఈ­లో పర్య­టి­స్తు­న్నా­రు. మూడు రో­జుల యూఏఈ పర్య­ట­న­లో భా­గం­గా శోభా గ్రూ­ప్ ఛై­ర్మ­న్ పీ­ఎ­న్సీ మీ­న­న్‌­తో చం­ద్ర­బా­బు భేటీ అయ్యా­రు. ఈ సం­ద­ర్భం­గా అమ­రా­వ­తి­లో అధు­నా­తన లై­బ్ర­రీ ని­ర్మా­ణం కోసం శోభా గ్రూ­ప్ రూ.100 కో­ట్లు వి­రా­ళం ప్ర­క­టిం­చిం­ది. ఈ సం­ద­ర్భం­గా శోభా గ్రూ­ప్ ఛై­ర్మ­న్‌­ను చం­ద్ర­బా­బు అభి­నం­దిం­చా­రు. ఏపీ­లో పె­ట్టు­బ­డు­ల­కు ఉన్న అవ­కా­శా­లు వి­వ­రిం­చా­రు. వి­శా­ఖ­ప­ట్నం­లో జరి­గే సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు రా­వా­ల­ని వా­రి­ని ఆహ్వా­నిం­చా­రు. వర­ల్డ్ క్లా­స్ లై­బ్ర­రీ ఏర్పా­టు చే­సేం­దు­కు రూ.100 కో­ట్లు వి­రా­ళం ప్ర­క­టిం­చ­డం­పై ప్ర­త్యే­కం­గా అభి­నం­దిం­చా­రు. దు­బా­య్ లోని ప్ర­ముఖ రి­యా­ల్టి సం­స్థ శోభా గ్రూ­ప్ ఫౌం­డ­ర్ చై­ర్మ­న్ పీ­ఎ­న్సీ మీ­న­న్‌­తో సీఎం సమా­వే­శం అయ్యా­రు. మూడు రో­జుల చం­ద్ర­బా­బు దు­బా­య్, యూ­ఏ­ఐ­ల్లో పర్య­టి­స్తా­రు. పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­తో సమా­వే­శా­లు ని­ర్వ­హి­స్తా­రు. ఏపీ ప్ర­భు­త్వ ప్ర­తి­ని­ధు­ల­తో మూడు, పా­రి­శ్రా­మిక వే­త్త­ల­తో 14 వన్ టు వన్, రౌం­డ్ టే­బు­ల్ మీ­టిం­గ్స్ లో పా­ల్గొం­టా­రు.

అమ­రా­వ­తి­ని ప్ర­పం­చం­లో అత్యు­త్తమ నగ­రం­గా ని­ర్మి­స్తు­న్న­ట్టు తె­లి­పిన సీఎం..రా­జ­ధా­ని ని­ర్మా­ణం­లో శోభా రి­యా­ల్టి సం­స్థ కూడా భా­గ­స్వా­మి కా­వా­ల­ని ఆహ్వా­నిం­చా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి వచ్చి రా­జ­ధా­ని ని­ర్మా­ణా­న్ని పరి­శీ­లిం­చా­ల­ని శోభా గ్రూ­ప్ ఛై­ర్మ­న్ పీ­ఎ­న్సీ మీ­న­న్‌­ను కో­రా­రు.శోభా రి­యా­ల్టీ లాం­టి ది­గ్గజ సం­స్థ­లు పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు సరైన గమ్య­స్థా­నం ఏపీ అని పే­ర్కొ­న్నా­రు.

దుబాయ్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సులో..

దు­బా­య్ ఫ్యూ­చ­ర్ మ్యూ­జి­యం­ను మం­త్రు­లు, అధి­కా­రు­ల­తో కలి­సి చం­ద్ర­బా­బు సం­ద­ర్శిం­చా­రు. అం­త­రి­క్షం, వా­తా­వ­ర­ణం, ఆరో­గ్యం, వి­ద్య, వై­ద్యం, ఏఐ వంటి రం­గా­ల్లో భవి­ష్య­త్ ఆవి­ష్క­ర­ణ­లు ఏవి­ధం­గా ఉం­డ­బో­తు­న్నా­య­నే­ది టె­క్నా­ల­జీ­ని ఉప­యో­గిం­చి మ్యూ­జి­యం­లో ప్ర­ద­ర్శ­ణ­లు చే­స్తు­న్న­ట్లు అక్క­డి అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. ఫ్యూ­చ­ర్ జర్నీ పే­రు­తో ఏర్పా­టు చే­సిన ఎక్సీ­పీ­రి­య­న్స్ జో­న్‌­ను సీఎం చం­ద్ర­బా­బు సం­ద­ర్శిం­చా­రు. దు­బా­యి­లో సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు రోడ్ షోలో పా­ల్గొ­న్న చం­ద్ర­బా­బు.. అక్క­డి పె­ట్టు­బ­డి­దా­రు­ల­తో ఏపీ­లో­ని పె­ట్టు­బ­డి అవ­కా­శా­ల­ను వి­వ­రిం­చా­రు. ఈ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు హా­జ­రైన వి­విధ కం­పె­నీల ప్ర­తి­ని­ధు­లు భా­రీ­గా హా­జ­ర­య్యా­రు. వి­శా­ఖ­లో గూ­గు­ల్ డేటా ఏఐ హబ్, అమ­రా­వ­తి­లో క్వాం­టం వ్యా­లీ ఏర్పా­టు కా­ను­న్నా­య­ని చం­ద్ర­బా­బు వి­వ­రిం­చా­రు. తి­రు­ప­తి, వి­శాఖ, అమ­రా­వ­తి­కి ప్ర­తి­ష్టా­త్మక సం­స్థ­లు వస్తు­న్నా­య­ని వి­వ­రిం­చా­రు. నవం­బ­ర్ 14, 15 తే­దీ­ల్లో వి­శా­ఖ­లో జరి­గే సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు హా­జ­రు­కా­వా­ల­ని పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­ను చం­ద్ర­బా­బు ఆహ్వా­నిం­చా­రు.

Tags:    

Similar News