ధర్నాలు, ర్యాలీలతో అమరావతి రద్దరిల్లుతోంది. రాజధాని పరిరక్షణే థ్యేయంగా.. రైతులు, మహిళలు, జేఏసీ నేతలు సమరశంఖం పూరించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. 302వ రోజు రాజధాని ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక నిరసనలు కొనసాగిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు. రాజధాని కోసం ఎందాకైనా ఎన్ని రోజులైనా ఉద్యమం చేస్తామని అంటున్నారు రాజధాని రైతులు.