ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఇప్పటివరకు రెండు విజయాలను నమోదు చేసింది. తొలి విజయాన్ని రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నమోదు చేశారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ తేడాతో గెలుపొందారు. 63,056 ఓట్ల వేల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. రాజమహేంద్రరవంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి... వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్పై వాసు విజయం సాధించారు.