జగన్ విశాఖ పర్యటన నేపధ్యంలో అధికారుల అత్యుత్సాహంపై మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. 40 ఏళ్లలో చాలామంది సీఎంలు వచ్చారు కానీ జగన్ లాంటి సీఎంలను చూడలేదన్నారు. సీఎం పర్యటనకు చెట్లు నరకడమేంటని ప్రశ్నించారు. జడ్ ప్లస్ సెక్కూరిటీ ఉన్న ప్రధాని కంటే జగన్ పోటుగాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగోడికి సెక్కూరిటీ ఏంటన్న అయ్యన్న జగన్ వస్తే చెట్లు నరికేస్తారా.. రోడ్లు బ్లాక్ చేస్తారా అంటూ మండిపడ్డారు. పొలిటికల్ బేస్ కోసం ఇంటర్నేషనల్ స్టేడియంలో డయాస్ ఏంటన్నారు. ఇలాంటి పనులు సైకోలు చేస్తారని.. సీఎం వస్తుంటే రెండ్రోజుల ముందే షాపులు మూసేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఓ మూర్ఖుడని.. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని తగలబెట్టేశాడన్నారు. అందుకే బయటకు రావడానికి సీఎం భయపడుతున్నాడంటున్నారు అయ్యన్న పాత్రుడు.