సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ కేసుల విచారణ..!

జగన్ కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. దాల్మియా కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గైర్హాజరయ్యారు.

Update: 2021-09-23 14:30 GMT

జగన్ కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. దాల్మియా కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గైర్హాజరయ్యారు. దీంతో శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసింది. వాన్ పిక్ కేసులో మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హజారుకాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి తరపు న్యాయవాదులు హాజరుకాకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని కోర్టు హెచ్చరించింది. అటు వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

Tags:    

Similar News