AP Ex-Minister Paleti Rama Rao: మరణదిన వేడుకలకు రండి.. మాజీ మంత్రి వింత ఆహ్వానం

AP Ex-Minister Paleti Rama Rao: బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు సంచలనాలకు తెరతీశారు.;

Update: 2022-12-17 10:32 GMT

Ex-Minister Paleti Rama Rao: బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు సంచలనాలకు తెరతీశారు. తనంతట తానుగా మరణదిన వేడుకలు జరపబోతున్నారు. ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న మనం.. ఎందుకు మరణదిన వేడుకలు జరుపుకోకూడదని ఆయన అంటున్నారు.



ఈ క్రమంలోనే తాను ఇక పుట్టిన రోజు వేడుకలు కాకుండా.. మరణ దిన వేడుకలు జరుపకోవాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. ఇప్పటికే తనకు 63 ఏళ్లని.. మరో 12 సంవత్సరాలు మరణ దిన వేడుకలు జరుపుకుంటానని పాలేటి ప్రకటించారు.



దీంతో చీరాల ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరగనున్న ఈ వేడుకల కోసం పలువురికి ఆహ్వానాలు సైతం అందజేశారు. భగవంతుడు ఎంత బోధించినా మానవుడు తన జీవన గమనాన్ని.. ఆలోచనా విధానాన్ని పూర్తిగా సరిచేసుకోలేకపోతున్నాడని.. పరులకు అపకారం జరిగే పనులను ఆపుకోలేకపోతున్నామని ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.



తన మరణానికి ఇంకా 12 ఏళ్లు ఉన్నాయని భావిస్తున్నానని అన్నారు. 35 ఏళ్ల వయసులోనే పాలేటి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. చిన్న వయసులోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

Tags:    

Similar News