AP High Court : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు 6 వారాల జైలు శిక్ష

AP High Court : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఆరు వారాలు జైలు శిక్ష విధించింది హైకోర్టు.

Update: 2022-04-22 11:52 GMT

AP High Court (tv5news.in)

AP High Court : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఆరు వారాలు జైలు శిక్ష విధించింది హైకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌ అధికారులు గిరిజా శంకర్‌, గోపాలకృష్ణ ద్వివేదికి 6 వారాల జైలు శిక్ష విధించింది. పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు అమలు చేయని కారణంగా... గతంలోనే జైలు శిక్ష విధించగా... క్షమాపణ కోరడంతో సేవా శిక్ష విధించింది. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సేవ చేయాలని... ఒక్కరోజు భోజన సదుపాయం కల్పించాలని... నెలలో ఒక రోజు విద్యార్థులతో గడపాలని తీర్పునిచ్చింది. అయితే ఆ ఆదేశాలను కూడా పాటించకపోవడంతో... ఆరు వారాలు జైలు శిక్ష విధించింది హైకోర్టు.


Full View


Tags:    

Similar News