ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం..

Update: 2020-11-19 15:01 GMT

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెలకొంది.. మంత్రి తల్లి నాగేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కొద్ది రోజులు విజయవాడ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందారు. రెండు రోజుల క్రితమే కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మరోసారి నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. అయితే నాగేశ్వరమ్మ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. మంత్రి తల్లి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News