ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ లేఖ

Update: 2020-12-05 16:31 GMT

స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి... ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య వార్‌ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్న నిమ్మగడ్డ... రాజ్యాంగంలోని 243 K అధికరణ కింద ఈసీకి స్వయంప్రత్తి ఉందని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి అని... ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు సమాన అధికారాలున్నాయని చెప్పారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్న నిమ్మగడ్డ... అలాంటి ఆర్డినెన్స్‌ తమ అనుమతి కోసం వస్తే తిరస్కరించాలని గవర్నర్‌ను కోరారు.


Tags:    

Similar News