AP: కేంద్ర బడ్జెట్లో.. ఏపీ వాటా ఎంతంటే..?
బడ్జెట్ ఏపీకి ఊతమిచ్చేలా ఉందన్న కూటమి
2026-27 బడ్జెట్లో ఏపీకి పలు కీలక కేటాయింపులు లభించాయి. మైనింగ్ అభివృద్ధికి రేర్ ఎర్త్ కారిడార్, పులికాట్ సరస్సు పరిరక్షణకు ప్రత్యేక నిధులు ప్రకటించారు. రాష్ట్రంలో కెమికల్ పార్కులు, కొబ్బరి, జీడిపప్పు వంటి పంటలకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు గతంలో ప్రకటించిన ఆర్థిక సాయం కొనసాగనుంది. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల ద్వారా ఏపీకి గణనీయమైన వాటా లభించనుంది. రేర్ ఎర్త్ కారిడార్ ఏపీ గేమ్ ఛేంజర్ గా మారనుందన్న అంచనాలు ఉన్నాయి.
అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో సుమారు రూ.1,128.91 కోట్లని ప్రాథమికంగా కేటాయించింది. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, ప్రాంతీయ అసమానతల తొలగింపు నుంచి పరిశ్రమల అభివృద్ధి వరకు—ప్రతి రంగంలోనూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అభివృద్ధి వేగం పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. ఈ నేపథ్యంలో 2026–27 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన డిమాండ్లతో కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల ద్వారా ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి కోసం ఈ క్రింది సంస్థలని కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఎంపిక చేసింది.
ఐబీఆర్డీ (IBRD) నిధుల ద్వారా రూ.432.09 కోట్లు.
పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల:** ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు.
గ్రామీణ రహదారులు:** ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు.
రహదారులు, వంతెనలు: **పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు.
కొబ్బరి ప్రోత్సాహక పథకం
కొబ్బరి ఉత్పత్తిని పెంచటం కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. కాయలుకాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ పథకం ముఖ్యంగా APలోని రైతులకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. కొబ్బరి తోటలో అగ్నిప్రమాదం వల్ల కలిగిన నష్టాన్ని తేలికపరుస్తుందన్నారు. కొబ్బరి ప్రోత్సాహక పథకం ఏపీ రైతులకు ప్రయోజనకరంగా మారనుంది.
క్యాన్సర్ బాధితులకు కొత్త ఊపిరి
కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని ఉపశమనాలు కల్పించారు. క్యాన్సర్ చికిత్స భారాన్ని తగ్గిస్తూ.. 17 రకాల ప్రాణరక్షక ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. పర్యావరణహిత ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ బయో గ్యాస్ ఆధారిత CNGకి సెంట్రల్ ఎక్సైజ్ మినహాయింపు ఇచ్చారు. అలాగే మైక్రోవేవ్ ఓవెన్లు, పౌర విమానాల విడిభాగాలపై పన్నులు తగ్గించడం ద్వారా ఆయా రంగాలకు ఊతమిచ్చింది. క్యాన్సర్ బాధితులకు ఇది ఊరటను ఇవ్వనుంది.
ఏపీ ప్రజల జీవనశైలిని మార్చేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్టు సహకరించేలా ఉంది. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉంది. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్ కు వెళ్తుంది. రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది." అనిచంద్రబాబు అన్నారు.
మోదీ, నిర్మలమ్మకు లోకేశ్ కృతజ్ఞతలు
భారతదేశ వేగవంతమైన అభివృద్ధి లక్ష్యాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన మేలు జరగనుందని అభిప్రాయపడ్డారు.