వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి : అయ్యన్నపాత్రుడు

వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. అంతర్వేదిలో..

Update: 2020-09-10 09:15 GMT

వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. అంతర్వేదిలో రథాన్ని పిచ్చోడు తగలబెట్టారంటారా అని... ఆయన ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు, భూములను విజయసాయి రెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సింహాచలం భూముల్లో గ్రావెల్‌, ఇసుకను APMDC అమ్మేశారని అయ్యన్న తెలిపారు. దేవాలయాల భూములను.. ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదన్నారు. 

Tags:    

Similar News