పశువుల పాకగా మారిన పాఠశాల

Update: 2020-10-19 15:05 GMT

పాఠశాలలు మూసి ఉంచడంతో వాటిని కొందరు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. ఏకంగా పాఠశాల ప్రాంగణంలో గేదెలు కట్టేసి పాకలా మార్చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండలో చోటుచేసుకుంది. హరిజనవాడలోని ఎలిమెంటరీ పాఠశాల పశువుల పాకగా మారింది. దీంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని సామాజిక వేత్తలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు

Tags:    

Similar News