జగన్ బెయిల్ రద్దు.. ఈ నెల 17కి విచారణ వాయిదా..!
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.;
YS Jagan Mohan Reddy ( File photo)
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపైన కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది న్యాయస్థానం. సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, రఘురామ తన పిటిషన్లో పేర్కొనగా.. ఆయన బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు రఘురామ.