CBN: క్యూఆర్‌ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు

నంధ్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

Update: 2026-03-09 12:00 GMT

నం­ద్యాల జి­ల్లా డోన్ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని కొ­త్త బు­రు­జు­లో ని­ర్వ­హిం­చిన పట్టా­దా­రు పా­సు­పు­స్త­కాల పం­పి­ణీ కా­ర్య­క్ర­మం­లో ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు పా­ల్గొ­న్నా­రు. గత ప్ర­భు­త్వం రె­వె­న్యూ వ్య­వ­స్థ­ను పూ­ర్తి­గా అస్త­వ్య­స్తం చే­సిం­ద­ని  చం­ద్ర­బా­బు మం­డి­ప­డ్డా­రు. రై­తుల భూ­ము­ల­ను ఇష్టా­ను­సా­రం­గా 22ఏ జా­బి­తా­లో పె­ట్టి వే­ధిం­చా­ర­ని, ల్యాం­డ్ టై­ట్లిం­గ్ యా­క్ట్ ద్వా­రా ప్రై­వే­ట్ భూ­ము­ల­పై పె­త్త­నం చలా­యిం­చా­ల­ని చూ­శా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. తాము అధి­కా­రం­లో­కి రా­గా­నే ఆ నల్ల చట్టా­న్ని రద్దు చేసి, భూ రి­కా­ర్డు­ల్లో­ని తప్పు­ల­ను సరి­ది­ద్దు­తు­న్నా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. గత పా­ల­కు­లు పా­సు­పు­స్త­కా­లు, సర్వే రా­ళ్ల­పై ఫో­టో­లు ము­ద్రిం­చు­కు­ని ప్ర­జల జీ­వి­తా­ల­తో ఆడు­కు­న్నా­ర­ని, ఇం­దు­కో­సం ఏకం­గా రూ.750 కో­ట్లు వృథా చే­శా­ర­ని చం­ద్ర­బా­బు ధ్వ­జ­మె­త్తా­రు. గత ప్ర­భు­త్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పు­డు పు­స్త­కా­ల­ను పక్క­న­బె­ట్టి, ఇప్పు­డు పక్కా­గా క్యూ­ఆ­ర్ కోడ్ ,  బ్లా­క్ చైన్ టె­క్నా­ల­జీ­తో కూ­డిన ట్యాం­ప­ర్ ప్రూ­ఫ్ పట్టా­ల­ను అం­ద­జే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు.

వైకాపా హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కొత్తబురుజు గ్రామసభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు.

హం­ద్రీ­నీ­వా నుం­చి తాగు నీరు ఇచ్చేం­దు­కు చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని ఆయన హామీ ఇచ్చా­రు. నం­ద్యాల జి­ల్లా కొ­త్త­బు­రు­జు సభలో చం­ద్ర­బా­బు ప్ర­సం­గిం­చా­రు. హం­ద్రీ­నీ­వా ద్వా­రా కు­ప్పా­ని­కి సైతం నీ­ళ్లు ఇచ్చా­మ­ని గు­ర్తు చే­శా­రు. రా­య­ల­సీ­మ­లో­ని ప్ర­తి ఎక­రా­కు నీ­ళ్లు ఇవ్వా­ల­న్న­దే తన సం­క­ల్ప­మ­ని చె­ప్పా­రు. తి­రు­మల లడ్డూ వ్య­వ­హా­రం­పై సీ­బీఐ ఇచ్చిన రి­పో­ర్టు­పై­నా తప్పు­డు ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు మం­డి­ప­డ్డా­రు. శ్రీ­వా­రి­కి అప­చా­రం చే­యా­ల­ని చూ­శా­ర­ని, కానీ తాను చూ­స్తూ ఊరు­కో­న­ని హె­చ్చ­రిం­చా­రు. మత వి­ద్వే­షా­ల­నూ రె­చ్చ­గొ­ట్టా­ల­ని చూ­స్తే కఠిన చర్య­లు తీ­సు­కుం­టా­మ­న్నా­రు. తాము అధి­కా­రం­లో­కి వచ్చిన వెం­ట­నే తి­రు­మల నుం­చే ప్ర­క్షా­ళన మొ­ద­లు­పె­ట్టా­మ­ని చె­ప్పా­రు. గత ప్ర­భు­త్వం తి­రు­మల పవి­త్ర­త­ను దె­బ్బ­తీ­సే ప్ర­య­త్నం చే­సిం­ద­న్నా­రు. ఇం­దు­లో భా­గం­గా­నే శ్రీ­వా­రి లడ్డూ ప్ర­సా­దం­లో కల్తీ పా­ల్ప­డ్డా­ర­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. రా­ష్ట్రం­లో కల్తీ మద్యం తయా­రు చేసి ప్ర­జల ప్రా­ణా­ల­తో చె­ల­గా­ట­మా­డా­ర­ని సీఎం చం­ద్ర­బా­బు ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. . సీ­మ­ను హా­ర్టి­క­ల్చ­ర్ హబ్  గా మా­రు­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి హామీ ఇచ్చా­రు. హం­ద్రీ­నీ­వా, గా­లే­రు నగరి వంటి ప్రా­జె­క్టు­ల­ను ఎన్టీ­ఆ­ర్ ప్రా­రం­భి­స్తే, వా­టి­ని పూ­ర్తి చేసే అదృ­ష్టం తనకు దక్కిం­ద­ని చె­ప్పా­రు. డోన్ ని­యో­జ­క­వ­ర్గం­లో 30 చె­రు­వు­ల­కు నీ­టి­ని అం­దిం­చా­మ­ని, భగీ­ర­థు­ని స్పూ­ర్తి­తో ప్ర­తి ఎక­రా­కు నీ­ళ్లి­వ్వ­డ­మే తన సం­క­ల్ప­మ­ని పే­ర్కొ­న్నా­రు. మా­మి­డి రై­తు­ల­కు కే­జీ­కి రూ.4 సబ్సి­డీ ఇవ్వ­డం­తో పాటు, అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్లో మె­రు­గైన ధర లభిం­చే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News