Voters List: తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. తెలంగాణలో యువకుల ఓట్లే ఎక్కువ;
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సవరించిన ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశాయి. ఏపీలో 2025 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 3 కోట్ల 35 లక్షల 27 వేల 925 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,66,41,489 మందికాగా.. మహిళా ఓటర్లు 1,68,67,735గా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు - 5,45,026 మంది ఉన్నారు.
ఏపీ ఓటర్ల జాబితా..
ఏపీలో మొత్తం ఓటర్లు: 4,14,40,447
మహిళా ఓటర్లు- 2,10,81,814.
పురుష ఓటర్లు - 2,02,88,543.
సర్వీస్ ఓటర్లు - 66,690.
థర్డ్ జెండర్ ఓటర్లు - 3,400 మంది
18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు- 5,14,646
రాష్ట్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు-46,397
తెలంగాణ ఓటర్ల జాబితా
తెలంగాణలో మొత్తం ఓటర్లు- 3,35,27,925
పురుష ఓటర్లు - 1,66,41,489
మహిళా ఓటర్లు - 1,68,67,735.
థర్డ్ జెండర్లు - 2,829.
18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు - 5,45,026.
85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు - 2,22,091.
ఎన్ఆర్ఐ ఓటర్లు - 3,591.
ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు - 5,26,993.