Chandra Babu: జగన్‌ సర్కారుపై చంద్రబాబు సమరభేరి..

Chandra Babu: జగన్‌ సర్కారుపై సమరభేరి మోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2022-11-30 11:18 GMT

Chandra Babu: జగన్‌ సర్కారుపై సమరభేరి మోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం విజయరాయి చేరుకున్నారు. కాసేపట్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.



అటు.. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు కాన్వాయ్‌ చుట్టూ వేలాది మంది యువత భారీ బైక్‌ ర్యాలీ పట్టింది. సుమారు 40 కిలోమీటర్ల మేర బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దారి వెంట చంద్రబాబుపై జనం పూల వర్షం కురిపించారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు.


బాదుడే బాదుడు పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలకు వివరించనున్నారు. మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.



ఇవాళ దెందులూరు, చింతలపూడి నియోజకవర్గం.. రేపు పోలవరం, కొవ్వూరు నియోజకవర్గం.. ఎల్లుండి తాడేపల్లిగూడెం, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. మూడు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో పాల్గొంటారు.


సాయంత్రం చింతలపూడి నియోజకవర్గంలోని మట్టంగూడెం, లింగపాలెం, చింతలపూడి పాతబస్టాండ్ ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి యర్రగుంటపల్లి, ముక్కెనవారిగూడెం, సీతంపేట, పలచర్ల, జిలుగుమిల్లి, జంగారెడ్డి గూడెం బైపాస్ మీదుగా నరసన్నపాలెం చేరుకోనున్నారు. 

Tags:    

Similar News